మన ప్రాచీన నాగరికత వైభవాన్ని ప్రతిబింబించే మన దేశానికి చెందిన కళాఖండాలను స్వదేశానికి రప్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అమెరికా నుండి 157 కళాఖండాలు & పురాతన వస్తువులను గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వదేశానికి తీసుకురానున్నారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అమెరికా కళాఖండాలు & పురాతన వస్తువులను అందజేసింది.
కళాఖండాలలో హిందూ మతం, బౌద్ధమతం & జైన మతానికి సంబంధించిన సాంస్కృతిక పురాతన వస్తువులు & బొమ్మలు ఉన్నాయి.