నిజామాబాద్ నగరంలోని BSNL కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొన్నాను. నాతోపాటు టెలికాం అడ్వైసరీ కమిటీ సభ్యులు, జీఎం మెంబర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ జగరాం గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో BSNL అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న నెట్ వర్క్ సమస్యలు తదితర అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించాను.
