Published On 21 Mar, 2022
Met Shri Piyush Goyal Ji In The Parliament Along With MP Shri Bandi Sanjay

ఈరోజు సహచర ఎంపీ లు శ్రీ బండి సంజయ్ గారు & శ్రీ సోయం బాపు రావ్ గారితో కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో భేటీ అవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో గతేడాది కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంటకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించి రైతులకు పరిహారం అందించడంపై చర్చించడం జరిగింది . తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ ల బృందం పీయుష్ గోయల్ గారికి వివరించడం జరిగింది. దీనికి గౌరవనీయులైన మంత్రి గారు కూడా PMFBYని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు మరియు పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన రావాలని తెలియచేశారు.

Met Shri Piyush Goyal Ji today in the Parliament along with MP Shri Bandi Sanjay Ji | Dharmapuri Arvind

Related Posts