‘13 ఏండ్ల తర్వాత మాతృభూమికి..మన పోతుగొండ మేడి ‘దుబాయ్’ వాసం పూర్తి.’
13 ఏండ్లకు ముందు దుబాయ్ కి పోయి, ఏజెంట్ మోసంతో పాస్ పోర్ట్ పోగొట్టుకొని, అష్టకష్టాలు పడ్డ బోధన్ కి చెందిన సోదరుడు పోతుగొండును భారత్ కి రప్పించడానికి మన ఎంపీ ఆఫీస్ స్వయంగా పూనుకొని, పెగడాపల్లి గ్రామం, బోధన్ మండలం లో అతని కుటుంబ వివరాలు కనుక్కొని ఎంబసీకి లేఖ వ్రాయడంతో అతని భారత్ ప్రయాణం ఖాయమైంది.
సినిమాను మించిన మలుపులతో, T. R శ్రీనివాస్ (చైర్మన్ అఫ్ గల్ఫ్ కోఆర్డినేషన్ కమిటీ, బీజేపీ) గారి తీవ్ర కృషితో , దుబాయ్ లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో ఇంటికి చేరుకున్నాడు.
సుమారు కోటి రూపాయలు అతను కట్టాల్సి ఉండగా, UAE ప్రభుత్వం నూతన వీసా వెసులుబాటు స్కీం ద్వారా, అందరి సహకారంతో మన దేశానికి తిరిగి వచ్చాడు.
అన్నట్టు మన పోతుగొండు 47వ పుట్టినరోజు ఈ నెలలోనే ఉంది.